శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శర్వానంద్ 35వ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. సోమవారం శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త స్టిల్స్ విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ ైస్టెలిష్గా కనిపిస్తున్నారు. ‘వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
శర్వానంద్ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. సాంకేతికంగా ఉన్నతమైన హంగులతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, రచన-దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.