టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand), కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టు ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). కిశోర్ తిరుమల (Kishore Tirumala) డైరెక్టర్ చేస్తున్న ఈ మూవీలో సీనియర్ నటీమణులు రాధికా శరత్కుమార్ (Radikaa Sarathkumar ), ఖుష్బూ సుందర్ (Khushboo), ఊర్వశి (Urvasi) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం శర్వా, రష్మిక అండ్ టీం రాజమండ్రి వెళ్లింది. కిశోర్ తిరుమల, హీరోహీరోయిన్ల బృందం రాజమండ్రి షూటింగ్ షెడ్యూల్ పార్టును నేడు షురూ చేసింది. తాజా షెడ్యూల్లో హీరోహీరోయిన్లతోపాటు ప్రధాన తారాగణంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షూట్తో సుమారు 80 శాతం సినిమా షూటింగ్ పూర్తయినట్టే.
ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శర్వానంద్ నటించిన మహాసముద్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా..బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్తో పుష్ప సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు హిందీలో రెండు సినిమాలు ఈ భామ ఖాతాలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Charmy Kaur | యాక్టింగ్లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం