Aadavallu Meeku Johaarlu Teaser | శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. ఈ సినిమాకు తిరుమల కిశోర్ డైరెక్టర్. ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాట విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. చెరుకూరి సుధాకర్ నిర్మాత.
తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. శర్వానంద్కు ఎన్ని పెళ్లి చూపులు చూసినా పెళ్లి కాదు. కొన్ని సార్లు శర్వా రిజెక్ట్ చేస్తుంటాడు. మరికొన్ని సార్లు శర్వాను.. అమ్మాయిలు రిజెక్ట్ చేస్తుంటారు. ఇంతలో తనకు రష్మిక పరిచయం అవుతుంది. అప్పుడే రష్మిక మాయలో పడిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది.. రష్మికను శర్వానంద్ పెళ్లి చేసుకుంటాడా? లేదా? అనే ఇతివృత్తంతో సినిమా స్టోరీ ఉండబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఏది ఏమైనా శర్వానంద్ ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పక్కా హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు.