‘యుద్ధంలో విజేతలు కాదు..కేవలం నిష్క్రమించిన వారే ఉంటారు’ అని బ్రిటీష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్లు యుద్ధం ఎప్పుడు విషాదానికి, మానవ హననానికి మాత్రమే సాక్షీభూతంగా నిలుస్తుందని బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ మాట్లాడిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘యుద్ధం అంతాన్ని కేవలం చనిపోయిన వారే చూసి ఉంటారు. యుద్ధంతో ఫలప్రదమైనదంటూ ఏమీ ఉండదు. విషాదం, ఒంటరితనం, అమానవీయత గురించే యుద్ధం మనకు చెబుతుంది. శాంతిస్థాపన, ధర్మరక్షణకు యుద్ధం ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. మానవ సంబంధమైన ఆర్తిని, సంఘర్షణను యుద్ధం ఎన్నటికీ తీర్చలేదు’ అంటూ షారుఖ్ఖాన్ వీడియోలో పేర్కొన్నారు.