‘దర్శకుడు ఈ కథ చెబుతున్నప్పుడు పెద్ద వంశీగారు గుర్తొచ్చారు. ఈస్ట్ గోదావరి వెటకారం, ఆ హ్యూమర్.. నిజంగా ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ రోజులు గుర్తొచ్చాయ్” అన్నారు హీరో రవితేజ. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్తో కలిసి రవితేజ నిర్మించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. సతీశ్వర్మ దర్శకుడు. కార్తీక్త్న్రం, గోల్డీ నిస్సీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది.
ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ ‘ఇందులో కొత్తవాళ్లే ఎక్కువగా పనిచేశారు. సినిమా విడుదలయ్యాక వారందరి పేర్లు మోగిపోతాయ్. కచ్చితంగా హిట్ సినిమా ఇది” అని నమ్మకం వ్యక్తం చేశారు. రవితేజని ఆదర్శంగా తీసుకొని హీరో అయిన నేను ఆయన నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటించడం గొప్ప అనుభూతి అని హీరో కార్తీక్త్న్రం సంతోషం వెలిబుచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘ రవితేజ నన్ను నమ్మి బంగారంలాంటి అవకాశం ఇచ్చారు. కుటుంబసమేతంగా అందరూ చూడదగ్గ సినిమా ఇది’ అన్నారు.