రాజారవీంద్ర ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్చంద్ర నిర్మాతలు. పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రం టీజర్ని శుక్రవారం విడుదల చేశారు. హీరో శ్రీవిష్ణు టీజర్ని విడుదల చేసి చిత్రయూనిట్కు శుభాకాంక్షలు అందించారు.
ఇది పక్కా కుటుంబకథాచిత్రమని టీజర్ చెప్పకనే చెబుతున్నది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ మధ్య తరగతి తండ్రి కథ ఇది. భార్య, ఇద్దరు కొడుకులు, కూతురుతో సంసారాన్ని పరువుగా నెట్టుకొస్తున్న అతనికి తన బిడ్డలవల్లే ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజం తనని నిలదీసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు?.. కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా.
మధ్య తరగతి ఎమోషన్సే ఈ సినిమాకు ప్రధానబలం’ అని చెప్పారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్, మోహిత్, నీల, కాదంబరి కిరణ్, మాణిక్రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ స్వయంభు, సంగీతం: ఎం.ఎ.బెనెజర్ పాల్.