రక్షిత్శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన కన్నడ చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో విడుదల చేయబోతున్నది. కన్నడంలో విజయవంతమైన ఈ చిత్రానికి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు.
క్లాసిక్ లవ్స్టోరీగా ఈ చిత్రం ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ను ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రకటించింది. కన్నడ తరహాలోనే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.