santosham awards | ‘ఎన్ని కష్టాలు, అవరోధాలు ఎదురైనా అధిగమిస్తూ ఇరవై ఏళ్లుగా నిర్విరామంగా అవార్డుల్ని ఇస్తుండటం అభినందనీయం. సంతోషం అవార్డుల వేడుకలు మరో రెండు దశాబ్దాల పాటు ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలి’ అని అన్నారు నటుడు ఆలీ. సంతోషం-సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. బ్రోచర్ను ఆలీ విడుదలచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సారి జరగబోయే అవార్డుల వేడుకలకు తెలుగు అగ్రనటీనటులతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల తారలు పాల్గొనబోతున్నారు’ అని తెలిపారు. సురేష్ కొండేటి సంకల్పబలం వల్లే సుదీర్ఘకాలం పాటు ఈ అవార్డు వేడుకలు విజయవంతమవుతున్నాయని హీరో సుశాంత్ అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘ఈ నెల 14న ఈ అవార్డుల వేడుకను నిర్వహించబోతున్నాం. రెండు దశాబ్దాల పాటు గుర్తుండిపోయేలా ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేదికపై దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వందమంది గాయనీగాయకులతో నివాళి అర్పించబోతున్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంద్రజ, ఆకాష్పూరి, మన్నారా చోప్రా తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సామీ సామీ పాటను మౌనిక యాదవ్ ఫస్ట్ టైం పాడగానే డీఎస్పీ ఎలా ఫీలయ్యాడు?
ఇందుక్కాదూ.. అభిమానులంతా నిన్ను జై బాలయ్య అంటూ నెత్తిన పెట్టుకునేది..?
నాగార్జున చేతిలో సన్నీకి బ్యాండ్ బాజా బారాతే.. నోటిని అదుపులో పెట్టుకోకుంటే..?
రాజా విక్రమార్క ఫస్ట్ డే కలెక్షన్స్.. కార్తికేయ సినిమాకు యావరేజ్ ఓపెనింగ్స్