పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్తో దుమ్ము రేపడానికి సిద్ధమవుతున్నాడు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయం సాధించింది. దర్శకుడు పూరి హీరో రామ్లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. మళ్లీ నాలుగేండ్ల తర్వాత దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ రామ్కు మరో విజయాన్ని కట్టబెట్టడానికి సిద్ధమవుతున్నది.
బాలీవుడ్ బిగ్బుల్ సంజయ్దత్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. సింగిల్ లుక్తో మాస్ ప్రేక్షకుల మతులు చెదరగొట్టే సంజూను, విలనిజానికి కొత్త నిర్వచనం చెప్పే పూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనికి తగ్గట్టే ఇటీవల విడుదలైన సంజూ ఫస్ట్లుక్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సంజయ్ బాడీలాంగ్వేజ్కు తగ్గట్టుగా కథలో ప్రతినాయకుడి పాత్ర డిజైన్ చేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం సెట్స్లో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.