బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తుంది. ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్, సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ లుక్ తోపాటు, రీసెంట్ గా విడుదల చేసిన అనిల్ కపూర్ ఫస్ట్ లుక్, రష్మిక మంధాన ఫస్ట్ లుక్ లకు సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇందులో బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్ నటిస్తుండగా. గీతాంజలిగా రష్మిక నటిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రీసెంట్గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ (Shah Rukh Khan)ను కలుసుకున్నాడు.
ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంట్లో గణపతి పూజ ఉండగా.. ఈ పూజలో పాల్గొనేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, పూజా దద్లానీ తదితరులు హాజరయ్యారు. ఇక పూజా అనంతరం షారూఖ్, సల్మాన్ ఇద్దరూ సీఎం ఏక్నాథ్ షిండేతో కలిసి ఫొటోలకు పోజులిచ్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే పూజా తర్వాత షారూఖ్ ఖాన్ టీ సిరీస్ ఆఫీస్ వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఆఫీస్ నుంచి షారూఖ్ బయటకు వెళ్ళేటప్పుడు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సందీప్ రెడ్డి వంగాను షారుఖ్కు పరిచయం చేశాడు.
ఇతను సందీప్ సర్ ‘యానిమల్’ అంటూ భూషణ్ కుమార్ పరిచయం చేయగా.. షారూఖ్ సందీప్ను హగ్ చేసుకుని యానిమల్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చేప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SRK wished Sandeep Reddy Vanga best wishes for #Animal & Bhushan also showed him the teaser 😍 #RanbirKapoor pic.twitter.com/5pyxGO5kVz
— RKᴬ (@seeuatthemovie) September 25, 2023
SRK with Sandeep Reddy Vanga ❤️🔥pic.twitter.com/Fv73yE6F1M
— Aman (@amanaggar02) September 24, 2023