Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత.. ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఇటీవల ‘యశోద’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సామ్.. ఆ తర్వాత ఎక్కడా బయట ప్రపంచానికి కనిపించలేదు. చిత్ర సక్సెస్ మీట్లకు కూడా దూరంగా ఉంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా లేదు. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్తో బాధపడుతున్న సమంత.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ దాని నుంచి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా సామ్ ముంబయి ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చింది. వైట్ సూట్ ధరించి స్టైలిష్ లుక్లో కనిపించింది. సామ్ను చూసిన అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
కాగా, సమంత.. ‘శాకుంతలం’, ఖుషీ, పలు బాలీవుడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా చిత్ర షూటింగ్లకు సామ్ దూరంగా ఉంది. ప్రస్తుతం వాటిని పూర్తి చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. శకుంతల, దుష్యంతుడి ప్రణయగాథ ఆధారంగా పౌరాణిక కథాంశంతో రూపొందిన ‘శాకుంతలం’ చిత్రం ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samantha | Mumbai Airport!
— Christopher Kanagaraj (@Chrissuccess) January 6, 2023