అగ్ర కథానాయిక సమంత బాలీవుడ్ ఎంట్రీ గురించి ఏడాదికాలంగా వార్తలొస్తున్నాయి. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె ఓ హారర్ కామెడీ చిత్రంలో నటించనుందని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. దీనికి ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్నగర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు.
జూన్లో సెట్స్మీదకు వెళ్లనుందని తెలిసింది. అమర్కౌషిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారర్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించబోతున్నారు. ‘ది ఫ్యామిలీ మెన్-2’ వెబ్సిరీస్ ద్వారా సమంత హిందీ ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ఆమె ‘సిటాడెల్’ వెబ్సిరీస్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత తాజా పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.