Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత ఇటీవల తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానంటూ ప్రకటించి అభిమానులను షాక్కు గురి చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి సమంత ఆరోగ్యంపై రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. సమంత అనారోగ్యంపై తాజాగా తమిళ మీడియాలో పలు వదంతులు వస్తున్నాయి. సమంత తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరిందని.. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా నటి మేనేజర్ స్పందించారు. వదంతులు నమ్మొద్దని తెలిపారు. సమంత క్షేమంగానే ఉందని.. ప్రస్తుతం ఇంట్లో ఉన్నట్లు వెల్లడించారు.
సమంత గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై అక్టోబర్ చివరి వారంలో నటి స్పందించారు. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ‘గత కొన్ని నెలల నుంచి మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా’ అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించారు.