హీరోల మాదిరిగానే హీరోయిన్స్ మధ్య కూడా సఖ్యత ఉంటుంది. కొందరు హీరోయిన్స్ అయితే చాలా క్లోజ్గా ఉంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల సమంత, త్రిష, కళ్యాణి ప్రియదర్శన్తో కలిసి చెన్నైలో తెగ రచ్చ చేసింది. ప్రస్తుతం నయనతారతో కలిసి సినిమా చేస్తుంది సమంత(Samantha) . అయితే ఈ ముద్దుగుమ్మ నయనతార(Nayanthara)తో పాటు ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్కి బెస్ట్ విషెస్ అందించింది.
తమిళ చిత్రం ‘కూళంగల్’ (పెబెల్స్) 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు మనదేశం తరఫు నుంచి ఎంట్రీ ఇవ్వనుంది. ఇదే విషయాన్ని శనివారం ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఛైర్ పర్శన్ షాజీ ఎన్ కరుణ్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు (ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఎఫ్ఎఫ్ఐ జనరల్ సెక్రెటరీ సుప్రాన్ సెన్ తెలిపారు.ఈ విషయం ప్రకటించిన వెంటనే వారికి పలువురు సెలబ్స్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అందాల నాయిక సమంత తన మైక్రో బ్లాగింగ్ పేజ్ ద్వారా ఆ ఇద్దరికీ అభినందనలు తెలిపారు. ‘మీ ఇద్దరికీ ఘనమైన అభినందనలు. ఇది చాలా అద్భుతమైన వార్త. ‘కూళంగల్’ సినిమా టీమ్ కి కూడా నా శుభాభినందనలు. మోర్ పవర్ టు యూ’ అంటూ సామ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ‘కూళంగల్’ మూవీని తమిళ ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. మొత్తం 14 ఇండియన్ సినిమాలు ఆస్కార్ ఎంట్రీకి ఎంపికవగా.. వాటిలో ‘కూళంగల్’ తో పాటు తమిళ ‘మండేలా’, మలయాళ ‘నాయాట్టు’, సర్దార్ ఉద్దమ్ , షేర్ని, షేర్షా, తూఫాన్ హిందీ చిత్రాలతో పాటు, మరాఠీ మూవీ ‘గోదావరి’ కూడా ఆస్కార్ కి నామినేట్ అవడం విశేషం.
ఇది కూడా చూడండి
Charmy Kaur | యాక్టింగ్లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Bigg Boss: హౌజ్మేట్స్తో పలు గేమ్స్ ఆడించిన నాగార్జున.. విజేతగా నిలిచిన అనీ మాస్టర్
Raja Babu: రాజబాబు కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు