సన్ డే ఫన్ డే .. బిగ్ బాస్ హౌజ్లో నాగార్జున ఆ రోజు వెరైటీ ఆటలు ఆడిస్తూ ఒకరిని ఎలిమినేట్ చేస్తుంటారు. తాజా ఎపిసోడ్లో మొదటి టాస్క్లో పట్టుకోండి చూద్దాం అనే ఆటను ఇచ్చాడు. ఈ టాస్క్లో హౌజ్ మేట్స్ రింగ్లో ఉన్న పిల్లోస్ని దక్కించుకోవల్సి ఉండగా, గే్లో చివరకు షణ్ను, కాజల్ ఓడిపోయారు. అయితే షణ్ముఖ్కి దక్కిన పిల్లో కోసం సిరి బ్రతిమలాడగా, 10 సార్లు సారీ చెప్పించుకొని ఇచ్చాడు.
ఇక రెండో ఆటగా చలనచిత్ర వీర అంటూ ఆడించాడు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే.. పరిగెత్తి గంటను కొట్టి సమాధానాలు చెప్పాలి. తప్పు చెప్పిన వారు సెకండ్ రౌండ్ నుండి ఎలిమినేట్ అవుతారు. గేమ్ ఆసక్తికరంగా సాగగా, తప్పు సమాధానాలు చెప్పిన జెస్సీ, ప్రియ, మానస్, ప్రియంక తప్పుకున్నారు. ఆ తరువాత మళ్లీ నీళ్లు కన్నీళ్లు అనే ఆట ఆడించాడు. ఇంతకు ముందు అవుట్ అయిన కంటెస్టెంట్లు సాయపడొచ్చు లేదంటే అడ్డుపడొచ్చు అని చెప్పాడు.
ఇక నీళ్లు నింపే టాస్క్ చివరి సమయానికి రవి, లోబో అవుట్ అయ్యాడు. మిసెస్ ప్రభావతి దయతో లోబో సేఫ్ అయ్యాడు. చివరకు మిగిలిన ఆనీ, విశ్వ, శ్రీరామ, సిరి, సన్నీలఓ తమ్యూజికల్ చైర్ ఆటనుపెట్టాడు. ఇందులో మొదటి పాటకే సిరి అవుట్ అయింది. రెండో సారికి సన్నీ పక్కకు జరిగిపోయాడు. చివరకు శ్రీరామచంద్ర, విశ్వ, ఆనీలు మిగిలారు. వారికి నాగ్.. నేను చెప్పిన కలర్ వస్తువులని ఇంట్లో నుండి తీసుకురావాలని చెప్పారు.
ఈ టాస్క్లో శ్రీరామచంద్ర ఓడిపోయాడు. చివరకు ఆనీ, విశ్వలు మిగిలితే టోపీ పోటీ అని టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్లో ఎవరి టోపీ ముందు పడితే వారు ఓడిపోయినట్టు అని చెప్పగా, ఇందులో అనీ మాస్టర్ గెలిచింది. ఈ క్రమంలో అనీ మాస్టర్కు నాగార్జున ఓ పవర్ ఇచ్చాడు. కానీ ఆ పవర్ ఏంటో అన్నది బిగ్ బాస్ చెబుతాడని తెలిపాడు.