కథను నమ్మి సినిమా తీసే దర్శకుల్లో ముందు వరుసలో ఉంటాడు క్రిష్ (Krish). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కల్యాణ్తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా గురజాడ వెంకట అప్పారావు రాసిన పాపులర్ తెలుగు నాటకం కన్యాశుల్కం ఆధారంగా క్రిష్ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడని ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో మధురవాణి పాత్రలో (వేశ్యగా) అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిస్తోంది.
తాజాగా ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన మరొక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. టాలెంటెడ్ యాక్టర్ సాయికుమార్ ( Sai Kumar) ఈ ప్రాజెక్ట్లో భాగం కానున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం రామప్ప పంతులు పాత్రలో కనిపించబోతున్నాడు సాయికుమార్. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ Sony LIV లో ప్రీమియర్ కానుంది. ఈ వెబ్ ప్రాజెక్ట్ టైటిల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఈ ఇంట్రెస్టింగ్ కథకు ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు..మిగిలిన పాత్రల్లో ఎవరెవరు కనిపించబోతున్నారనేది తెలియాల్సి ఉంది. క్రిష్ చేస్తున్న హరిహరవీరమల్లు సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉండగా..ఇటీవలే పవన్కల్యాణ్ అండ్ టీం వర్క్ షాప్లో కూడా పాల్గొన్నది. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా కూడా మారాయి.
Read also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్లో ఆర్ఆర్ఆర్ యాక్టర్.. స్టన్నింగ్ లుక్ అవుట్
Read also : Rakshit Atluri | బ్యూటీఫుల్ వీడియోతో పలాస 1978 హీరో శశివదనే అప్డేట్
Read also : laya mangli dance | జాలే వోసినవేమయ్య పాటకు లయ, మంగ్లీ డ్యాన్స్.. ట్రెండింగ్లో వీడియో
Read also : ‘సర్దార్’ నుండి క్రేజీ అప్డేట్.. అక్కినేని ఫ్యాన్స్కు సంబురాలే..!