ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో సైఫ్అలీఖాన్ కీలక పాత్రలో నటించనున్నట్లు గత కొద్దిరోజులగా వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిని చిత్రబృందం ధృవీకరించింది. ఈ మేరకు ఓ ఫోటోను సోషల్మీడియా ద్వారా పంచుకుంది. ఎన్టీఆర్ 30 సినిమా సెట్స్లోకి సైఫ్అలీఖాన్ అడుగుపెట్టాడని పేర్కొంది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతున్నది. భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తున్న బాలీవుడ్ నాయిక జాన్వీకపూర్ సైతం తాజా షూటింగ్లో పాల్గొంటున్నది.
పవర్ఫుల్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైఫ్అలీఖాన్ ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’లో ప్రతినాయకుడు లంకేష్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో కూడా సైఫ్అలీఖాన్ విలన్ పాత్రలోనే కనిపించనున్నట్లు సమాచారం.