మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న క్రమంలో ఆయన బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్తేజ్ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
అయితే ప్రస్తుతం అపోలోలో సాయి ధరమ్కి మెరుగైన చికిత్స అందిస్తుండగా,ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరిగిందని, అది పెద్ద సమస్య కాదని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేషన్పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 48 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. ప్రస్తుతానికి తేజ్ ఆరోగ్యంగా నిలకడగానే ఉందని తెలిపారు. త్వరగానే కోలుకుంటాడని, ఎవరూ టెన్షన్ పడొద్దని చెప్పారు. యాక్సిడెంట్కు గురవడం వల్ల షాక్లో అపస్మారకస్థితిలోకి వెళ్లారని, మరే ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు.