‘కశ్మీర్ ఫైల్స్’పై తను చేసిన వ్యాఖ్యల గురించి హీరోయిన్ సాయి పల్లవి వివరణ ఇచ్చింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పిన ఆమె.. ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు తను చేయలేదని స్పష్టంచేసింది. ‘‘నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పే. ఏ మతంలోనైనా హింస మంచిది కాదని గతంలోనే చెప్పా.
ఒక డాక్టర్గా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు’’ అని తేల్చిచెప్పింది. ఇటీవల విడుదలైన ‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశానని చెప్పిన ఆమె.. పశువులను తీసుకెళ్తున్న లారీ డ్రైవర్పై దాడి చేయడాన్ని ప్రశ్నించింది.
దీంతో చాలా మంది ఆమె మాటలను తప్పుబట్టారు. ఉగ్రవాదులతో కలిసి కొందరు చేసిన మారణహోమాన్ని ఒక చిన్న ఘటనతో ఎలా పోలుస్తావంటూ ఆమెపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై సాయి పల్లవి వివరణ ఇచ్చింది.