ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్'(రౌద్రం రణం రుధిరం). డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అలియాభట్, ఓలివియా మోరిస్ కథానాయికలు. చారిత్రక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2022 జనవరి 7న విడుదలచేయబోతున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ను విడుదలచేశారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలకు ఫిక్షనల్ అంశాల్ని జోడిస్తూ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అజయ్దేవ్గణ్, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.