దేశవ్యాప్తంగా అపూర్వ విజయం సొంతం చేసుకోవడమే కాకుండా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకున్న చారిత్రక కాల్పనిక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో దిగబోతున్నది. ఈ విషయాన్ని గురువారం చిత్రబృందం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఆస్కార్ రేసులో పోటీపడేందుకు జనరల్ కేటగిరిలో ఐప్లె చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. “ఆర్ఆర్ఆర్’ అఖండ విజయం ప్రపంచ వేదికపై భారతీయ సినిమా సత్తాను తెలియజెప్పింది. విశ్వవ్యాప్తంగా భాషా, సాంస్కృతిక పరమైన హద్దుల్ని చెరిపివేస్తూ అందరి మన్ననలు సొంతం చేసుకుందీ చిత్రం. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
మీవల్లే ఈ అసాధారణ ప్రయాణం సాధ్యమైంది. ఆస్కార్ రేసులో పోటీపడేందుకు జనరల్ కేటగిరిలో ఐప్లె చేశాం’ అని ట్విట్టర్ ప్రకటనలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. పలు విదేశీ పత్రికలు సైతం ఈ సినిమాకు ఆ అవకాశం ఉందంటూ కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ను భారత్ తరపున ఆస్కార్ నామినేషన్కు పంపిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. తాజాగా జనరల్ కేటగిరిలో ఆస్కార్ పోటీలో దిగుతున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం తెలియజేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 400కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.