53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమా స్క్రీనింగ్కు ఎంపికైన సినిమాల జాబితాను శనివారం ప్రకటించారు. ఇందులో 25 ఫీచర్ ఫిలింస్, 20 నాన్ ఫీచర్ ఫిలింస్ ఉన్నాయి. వచ్చే నెల 20 నుంచి 28 వరకు గోవాలో ఇఫీ వేడుకలు జరగనున్నాయి. తెలుగు నుంచి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’, బాలకృష్ణ ‘అఖండ’ చిత్రాలు మెయిన్ స్ట్రీమ్ సినిమా సెలక్షన్ విభాగంలో ప్రదర్శనకు రానున్నాయి. ఫీచర్ విభాగంలో సినిమాబండి, ఖుదీరాంబోస్ ఎంపిక య్యాయి. తెలుగు రాష్ర్టాల నుంచి దర్శకులు ప్రేమ్రాజ్, వి.ఎన్.ఆదిత్యలు జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.