రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ చిత్రం డివోషనల్ థ్రిల్లర్గా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. భూతకోల నేపథ్య ఇతివృత్తంతో సరికొత్త అనుభూతిని పంచింది. ఈ చిత్రానికి ప్రీక్వెల్ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో తొలిభాగం ఆరంభానికి ముందు జరిగిన కథను చూపించబోతున్నారు.
డిసెంబర్లో ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్లనుందని చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ సినిమా కోసం రిషబ్శెట్టి గుర్రపుస్వారీతో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ పొందబోతున్నారు. ఇక రెండో భాగంలో భూతకోల, పంజుర్లి దైవారాధన పుట్టుపూర్వోత్తరాలను..సంస్కృతిపరమైన ప్రాధాన్యతను ఆవిష్కరించబోతున్నారని సమాచారం.
వచ్చే ఏడాది ఆగస్ట్ కల్లా చిత్రీకరణ పూర్తిచేసి దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మొదటిభాగానికి పాన్ ఇండియా స్థాయిలో దక్కిన ఆదరణ దృష్ట్యా ప్రీక్వెల్ను భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక హంగులను మేళవించి తెరకెక్కించబోతున్నారని తెలిసింది.