RGV |పహల్గం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారతీయులు అందరు రగిలిపోయారు. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట భారత్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలపై భీకర దాడులు నిర్వహించింది. కీలకమైన 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి కచ్చిత లక్ష్యంతో వైమానిక దాడులు నిర్వహించింది. దీనిపై భారతీయులు అందరు హర్షం వ్యక్తం చేశారు. అయితే పహల్గాం ఉగ్రదాడి ఘటన సమయంలో ఉగ్రవాదులు టూరిస్టు మహిళల దగ్గరకు వచ్చి వారి కళ్ల ముందే భర్తలని ఎంతో కిరాతకంగా చంపేశారు.
మోదీకి ఓట్లు వేసి గెలిపించారుగా.. పోయి చెప్పు అని ఆ టర్రరిస్టులు భారత మహిళలతో అన్నారు. మరోవైపు చనిపోయిన భర్త పక్కన దీనంగా కూర్చుని ఏడుస్తున్న మహిళ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ పిక్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అయింది. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇప్పుడు ఒక ఫొటో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో టెర్రరిస్టులు మోదీకు చెప్పు అని ఓ వైపు ఉంటే.. మరోవైపు మోదీకి చెప్పాను అని ఓ మహిళ కోపంతో ఉగ్రమూకల శవాల మధ్య నిల్చొని ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఇదే స్టైల్లో రామ్ గోపాల్ వర్మ కూడా ఆపరేషన్ సిందూర్పై ఓ ట్వీట్ వేశాడు.
వర్మ పాక్ ఉగ్రవాదులపై సెటైరికల్ గా కామెంట్స్ చేశాడు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఒక మహిళ భర్తని చంపి.. వెళ్లి మోడీ కి చెప్పు అని అన్నారు. ఇప్పుడు ఆ మహిళ నిజంగానే మోడీకి చెప్పింది అంటూ రాంగోపాల్ వర్మ పోస్ట్ చేశారు. రామూజీ పోస్ట్ కూడా వైరల్గా మారింది. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామిక వేత్తలు సైతం భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ జై హింద్ అని ట్వీట్ చేశారు.