ఇటీవల ‘మా’ ఎన్నికలు (Movie Artistes Association) ముగిసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగబాబు, పవన్కల్యాణ్, రాంచరణ్తోపాటు పలువురు సినీ తారలు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం పోలింగ్ కు రాలేదు. మరి మెగా ఫ్యామిలీ హీరోలంతా వచ్చి ఓటేసినా అల్లు అర్జున్ ఎందుకు రాలేదని చాలా మంది తెగ చర్చించుకుంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. అల్లు అర్జున్ మాల్దీవులు వెకేషన్కు వెళ్లడం వల్లే మా ఎన్నికలకు రాలేకపోయాడట.
ఓ వైపు పుష్ప షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా అల్లు అర్జున్ చిత్రీకరణకు విరామం ఇచ్చి మాల్దీవులకు చిన్న ట్రిప్ వేశాడని, అందువల్లే ఎన్నికల్లో కనిపించలేదని టాక్. మరోవైపు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా ఎన్నికలకు రాలేదు. సినిమా షూటింగ్లో బిజీగా ఉండి పోలింగ్ లో పాల్గొనలేదా..? ఇంకా వేరే కారణాల వల్ల కనిపించలేదా..? అన్నది తెలియాల్సి ఉంది.
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న పుష్ప రెండు పార్టులుగా రాబోతుంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్