వైవా హర్ష, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకుడు. ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకాలపై రవితేజ, సుధీర్కుమార్ కుర్రు నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను రవితేజ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సుందరం అనే గవర్నమెంట్ టీచర్ కథ ఇది. మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెటూరుకు అతను ఇంగ్లీష్ టీచర్గా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.
ఈ క్రమంలో ఏం జరిగిందన్నది వినోదాన్ని పంచుతుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దీపక్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, రచన-దర్శకత్వం: కల్యాణ్ సంతోష్.