‘జాతిరత్నాలు’ చిత్రంతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు అనుదీప్ కేవీ. తనదైన శైలి వినూత్న కామెడీతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆయన ద్వితీయ చిత్రం ‘ప్రిన్స్’ కూడా ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం రవితేజ కథానాయకుడిగా అనుదీప్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఇటీవల అనుదీప్ చెప్పిన సబ్జెక్ట్ రవితేజను బాగా ఇంప్రెస్ చేయడంతో ఆయన వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పారని అంటున్నారు. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగిల్’ చిత్రాల్లో నటిస్తున్నారు రవితేజ. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు లైనప్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాతే అనుదీప్ దర్శకత్వం వహించే సినిమాపై స్పష్టత వస్తుందంటున్నారు.