ఆర్ట్ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. రవితేజ మహాదాస్యం కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మద్దుల మదన్కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
సౌజన్య కావూరి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి హీరో విరాజ్అశ్విన్ క్లాప్నివ్వగా, పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విఛాన్ చేశారు. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నితిన్ రెడ్డి చిమ్ముల, సంభాషణలు, పాటలు: జక్క రాజశేఖర్ రెడ్డి, దర్శకత్వం: మదన్కుమార్ మద్దుల.