కన్నడ సోయగం రష్మిక మందన్నా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)తో కలిసి నటిస్తున్న చిత్రం వారసుడు (Vaarasudu). టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా షూటింగ్ టైంలో రష్మిక కోస్టార్లు ఖుష్బూ, విజయ్తో కలిసి దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పూల తోటలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్న టైంలో ఈ సెల్ఫీ దిగినట్టు అర్థమవుతుంది.
ఈ మూవీ తెలుగులో వారసుడు, తమిళంలో వారిసు టైటిల్తో తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రాన్ని 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు దీపావళి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. వారసుడు చిత్రంలో ఖుష్బూ సుందర్, జయసుధ, ప్రకాశ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వారసుడు చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్నారు.
వారసుడు వర్కింగ్ స్టిల్స్ పై ఓ లుక్కేయండి మరీ..
Read Also : Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యామిలీ ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Read Also : Sudheer Babu | ఇన్ల్యాండ్ లెటర్తో సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్.. వివరాలివే
Read Also : Lokesh Kanagaraj | ఒకేసారి దళపతి 67, ఖైదీ 2 అప్డేట్స్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో