గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నారు విజయ్ దేవర కొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా. గీతగోవిందం ఈ ఇద్దరి కెరీర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోయింది. విజయ్, రష్మిక (Rashmika Mandanna) రెండోసారి డియర్ కామ్రేడ్లో మెరిశారు. అయితే మళ్లీ వీళ్లిద్దరూ ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటారోనని తెగ ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
ఓ చిట్చాట్లో విజయ్తో మళ్లీ ఎప్పుడు నటిస్తారని అడిగిన ప్రశ్నకు రష్మిక సమాధానమిస్తూ.. నేను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్తో ఉన్నా. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండతో కలిసి పనిచేసే ప్లాన్స్ ఏమీ లేవు. అభిమానులు విజయ్తో మరోసారి కలిసి నటించాలని విజ్ఞప్తి చేస్తున్నారని నాకు తెలుసు. కానీ వచ్చే ఏడాది లేదంటే ఆ తర్వాత విజయ్ తో నటించే ఛాన్స్ ఉండొచ్చునని చెప్పుకొచ్చింది రష్మిక.
న్యూ ఇయర్ సందర్భంగా ఇన్స్ట్రాగ్రామ్ ప్రొఫైల్స్ చూస్తే విజయ్, రష్మిక బ్యూటీ ఫుల్ వెకేషన్కు ప్లాన్ చేసినట్టు అర్థమవుతున్నా..దీనిపై అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ రాలేదు. వెకేషన్లో ఉన్న రష్మికతో విజయ్ చిట్ చాట్ చేస్తున్న ఓ వీడియో కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
రష్మిక, విజయ్ ఇద్దరు తమ తమ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. రష్మిక ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టైం టేబుల్ ఫుల్ ఉండగా.. విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషీ నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు.
VD voice in the background😅😅#VIROSH #VijayDeverakonda #RashmikaMandanna
may be friends or may be something else 😜😜 pic.twitter.com/vYAraniND0— Bharath (@Bharath__b) January 2, 2023