బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా, కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వస్తున్న చిత్రం మిషన్ మజ్ను(Mission Majnu). ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫాం నెట్ ఫ్లిక్స్ లో జనవరి 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో ఇప్పటినుంచే బిజీ అయిపోయింది టీం. ప్రమోషన్స్ లో భాగంగా ముంబై బాంద్రా పోర్టులో ఏర్పాటు చేసిన రబ్బా జండా సాంగ్ లాంఛ్ ఈవెంట్కు హీరోహీరోయిన్లిద్దరూ స్కూటర్పై వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సిద్ధార్థ్ స్కూటర్ నడపగా.. వెనక సీటులో కూర్చుంది రష్మిక . ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ట్రెండింగ్ అవుతోంది. ఈవెంట్కు హాజరవ్వడం చాలా ఫన్గా సాగింది..అని ఈ వీడియోకు ఓ అభిమాని కామెంట్ చేయగా.. రష్మిక మందన్నా నేను మీకు వీరాభిమానిని.. అని మరో నెటిజన్, సిద్దార్థ్ మల్హోత్రా-రష్మిక మందన్నా.. లవ్ అని మరో ఫ్యాన్ కామెంట్ పెట్టాడు.
1970 బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతుంది మిషన్ మజ్ను. దేశభక్తి, ప్రేమ అంశాల చుట్టూ సాగే ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా భారత గూఢచారి ఏజెంట్ పాత్ర లో కనిపించనున్నాడు. రష్మిక మందన్నా మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లోయానిమల్ మూవీ చేస్తోంది. రణ్బీర్కపూర్ హీరోగా నటిస్తున్నాడు. దీంతోపాటు త్వరలోనే పుష్ప.. ది రూల్ షూటింగ్లో కూడా జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది రష్మిక .
సిద్దార్థ్ , రష్మిక స్కూటర్ రైడ్.. వీడియో