Rashmika Mandanna | ‘పుష్ప’ సినిమాతో నేషనల్ క్రష్గా మారారు స్టార్ నటి రష్మిక మందన. ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రష్మిక నటించిన ‘వారీసు’ మూవీ తెలుగులో ‘వారసుడు’ పేరుతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత ‘మిషన్ మజ్ను’ కూడా నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రొమోషన్స్, వరుస ఇంటర్వ్యూలతో రష్మిక బిజీబిజీగాఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. సమంత ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.
సమంత, రష్మిక మంచి స్నేహితులు. పుష్ప చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. కాగా, సమంత ఇటీవల తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్తో బాధపడుతున్నా అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆమెతో చాలా మంది కలిసి నటించినప్పటికీ సామ్ అనారోగ్యం గురించి ఎవరికీ తెలియదు. ఇదే విషయం రష్మిక కూడా చెప్పింది. సామ్ మయోసైటిస్తో బాధపడుతున్నా అంటూ ప్రకటించే వరకు తనకూ తెలీదని తెలిపింది. ఈ సందర్భంగా సమంతపై ఎమోషనల్ కామెంట్లు చేసింది. సమంత ఒక అద్భుతమైన స్త్రీ మూర్తి అని పేర్కొంది. ఆమె అందమైన మహిళే కాదు.. దయాగుణం కలిగిన వ్యక్తి అని కొనియాడింది.
‘సమంత మయోసైటిస్ బారినపడినట్లు తను ప్రకటించే వరకూ నాకు కూడా తెలియదు. మేము కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నా.. తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాటమాత్రం కూడా చెప్పలేదు. సమంత చాలా అందమైన, దయగల మహిళ. ఒక అమ్మలా తనని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నా. జీవితంలో తను ఎన్నో సవాళ్లతో పోరాడి నిలబడింది. అందుకే సమంత అంటే అందరిలా నాకు కూడా స్ఫూర్తి. నేను ఎంతగానో ఇష్టపడే సామ్కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ అని రష్మిక చెప్పుకొచ్చింది.