బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతార వంటి దక్షిణాది చిత్రాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల విడుదలైన‘పఠాన్’ను మినహాయిస్తే గత రెండేళ్లుగా హిందీలో సౌత్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద సంచలనాల్ని సృష్టించాయి. ‘పఠాన్’ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్ల మైలురాయిని దాటేందుకు సిద్ధమవుతున్నా.. హిందీ బెల్ట్తో పోల్చిచూస్తే దక్షిణాదిలో మాత్రం ఆశించిన స్థాయిలో భారీ కలెక్షన్స్ రాలేదని అంటున్నారు. తాజాగా ఈ విషయమై అగ్ర కథానాయిక రాశీఖన్నా స్పందించింది. బాలీవుడ్ దర్శకద్వయం రాజ్-డీకే రూపొందిస్తున్న ‘ఫర్జీ’ వెబ్సిరీస్లో ఈ భామ ప్రధాన పాత్రలో నటిస్తున్నది.
ఈ సిరీస్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్న రాశీఖన్నా మాట్లాడుతూ ‘సౌత్ సినిమాలు బాలీవుడ్లో రికార్డులు బద్దలు కొట్టాయి. అక్కడి హీరోల్ని సైతం ఉత్తరాది వారు అభిమానించడం మొదలుపెట్టారు. కానీ దక్షిణాదిలో ఈ ధోరణి కనిపించదు. హిందీ హీరోల్ని సౌత్ ప్రేక్షకులు తమ వారిగా ఓన్ చేసుకోవడం అంత సులభం కాదు’ అని పేర్కొంది. రాఖీఖన్నా అభిప్రాయంతో దర్శకులు రాజ్-డీకే సైతం ఏకీభవించారు. ఉత్తరాది నటులు తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్స్గా పేరు తెచ్చుకుంటున్నారని..హీరోలుగా మాత్రం ఎవరూ రాణించలేదని వ్యాఖ్యానించారు.