నరసింహా చారి, డా॥ సకారం మారుతి, భాస్కర్ రెడ్డి, చిత్రం శ్రీను, మీనాక్షి రెడ్డి, పల్సర్ బైక్ ఝాన్సీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రంగస్వామి’. నరసింహా చారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇటీవల ప్రముఖ నటుడు సుమన్ వీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘యువత డ్రగ్స్ ఉపయోగించినప్పుడు ఎంత ఆనందిస్తున్నారో.. ఆ తరువాత అంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని ఈ చిత్రంలో చక్కగా చూపించారు. కమర్షియల్ అంశాలతో పాటు యువతకు మంచి సందేశం ఈ చిత్రంలో ఉంది’ అన్నారు.