సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగుంటాయేమో కానీ రియల్ లైఫ్ లో మాత్రం కాదు. సినిమా ఇండస్ట్రీలో మీ ఫ్లాష్ బ్యాక్ ఎంత ఘనంగా ఉన్నా ప్రస్తుతం ఏంటి అనేది మాత్రమే చూస్తారు. గతం ఎంత ఘనంగా ఉన్నా ఇప్పుడు మీకు విజయాలు లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) పరిస్థితి అలాగే ఉంది. సిందూరం, నిన్నే పెళ్ళాడతా, ఖడ్గం లాంటి గొప్ప సినిమాలు తీసిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం పునర్వైభవం కోసం వేచి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు.
ఇంకా చెప్పాలంటే 20 ఏళ్లుగా ఈయనకు సరైన విజయం రాలేదు ఖడ్గం తర్వాత చందమామ, గోవిందుడు అందరివాడేలే సినిమాలు మాత్రమే కాస్త పర్లేదు అనిపించాయి. శశిరేఖ పరిణయం, మొగుడు, నక్షత్రం లాంటి సినిమాలు ఎప్పుడు వచ్చి వెళ్లిపోయాయో కూడా ప్రేక్షకులకు గుర్తులేదు అంటే.. కృష్ణవంశీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఈ దర్శకుడి ఆశలన్నీ రంగమార్తాండ (Rangamarthanda) సినిమాపైనే ఉన్నాయి.
మరాఠీలో మంచి విజయం సాధించిన నట సామ్రాట్ సినిమాను తెలుగులో రంగమార్తాండ పేరుతో రీమేక్ చేస్తున్నాడు కృష్ణవంశీ. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి సీనియర్స్ ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికావడంతో ప్రమోషన్ మొదలుపెట్టాడు క్రియేటివ్ డైరెక్టర్. దీనికోసం మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi)ని తీసుకొచ్చాడు. చిరంజీవితో ముందు నుంచి కృష్ణవంశీకి మంచి అనుబంధం ఉంది.
అప్పట్లో థమ్స్ అప్ యాడ్ ఈయన దర్శకత్వంలోనే చేశాడు మెగాస్టార్. ఆ తర్వాత కృష్ణవంశీ ఫామ్ లో లేని సమయంలో కూడా రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. మళ్లీ ఇప్పుడు రంగమార్తాండ సినిమా కోసం నేనొక నటుడుని.. అంటూ సాగే షయరీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు మెగాస్టార్. 4 నిమిషాలకు పైగా ఉన్న ఈ కవితకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కనీసం చిరు రాకతో అయినా క్రియేటివ్ డైరెక్టర్ జాతకం మారుతుందా అనేది చూడాలి.
Read Also : Vinaro Bhagyamu Vishnu Katha | కూల్గా కిరణ్ అబ్బవరం వాసవ సుహాస సాంగ్ ప్రోమో
Read Also : Naatu Naatu Song | నాటు నాటు క్రేజ్కు ఆస్కార్ రావాల్సిందే.. వీడియో సాంగ్పై లుక్కేయండి
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. గెట్ రెడీ