హాజీపూర్, మార్చి 23 : జిల్లాలో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికీ ప్రభుత్వ నియమ, నిబంధనల మేరకు రుణ సదుపాయం కల్పించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం బ్యాంకర్లతో రుణాల మంజూరుపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హత కలిగిన వారు రుణం పొందేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత సంబంధిత శాఖ ల అధికారులకు ఉందన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలీ రాజు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం శరత్, ఇతర బ్యాంకుల ఏజీఎంలు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి, వివిధ బ్యాంక్ల మేనేజర్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, అధికారులు పాల్గొన్నారు.
మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి..
నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. భవన నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్పర్సన్ జక్కు ల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్తో కలిసి పరిశీలించారు. అనంతరం నర్సరీలను, సేంద్రి య ఎరువుల తయారీ విధానాన్ని పర్యవేక్షించారు. కమిషనర్ వెంకటేశ్, డీఈ మసూద్ ఉన్నారు.
సాదాసీదాగా బడ్జెట్ సమావేశం
బెల్లంపల్లి మున్సిపల్ సాధారణ బడ్జెట్ సమావేశం మంగళవారం మున్సిపల్ మీటింగ్ హాల్లో సాదాసీదాగా సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన జరిగిన సమావేశానికి కలెక్టర్ భారతీ హో ళి కేరి, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ముసాయిదా బడ్జెట్ను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. మొత్తం ఆదాయం రూ.11కోట్ల 70 లక్షలు ఉండగా.. వ్యయం రూ.11 కోట్ల 24 లక్షలు, మిగులు బడ్జెట్ రూ.88వేలుగా అం చనా బడ్జెట్ను రూపొందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కమిషనర్ ఆకుల వెంకటేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.