నీరజ్ చోప్రాకు బంగారు పతకం వస్తే రజనీకాంత్ పేరు మారుమ్రోగిపోవడం ఏంటనే అనుమానం మీ అందరిలో ఉంది కదూ.. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. వివరాలలోకి వెళితే టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. జావెలిన్ త్రో ఫైనల్లో శనివారం పోటీపడిన నీరజ్ చోప్రా 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని గెలుపొందాడు.
నీరజ్ బంగారు పతకం సాధించడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే నీరజ్కి, రజనీకాంత్కి ఏమైన చుట్టరికం ఉందా? నీరజ్ పతకం సాధించడంతో రజనీకాంత్ పేరు ఎందుకు మారుమ్రోగిపోతుంది అనే విషయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు విషయం ఏంటంటే.. నీరజ్ ఒలంపిక్స్లో గోల్డ్ కైవసం చేసుకున్న అనంతరం స్టేడియం మొత్తం నీరజ్..నీరజ్..నీరజ్… నీరజ్ అంటూ మోత మోగిందట.
అయితే నీరజ్ని కంటిన్యూస్గా పలకడంతో నీరజ్ కాస్త రజనీగా మారుతుంది. కావాలంటే మీరు ఓ సారి ప్రయత్నించండి అంటున్నారు నెటిజన్స్. నీరజ్ అని పిలిచిన రజనీ అనే వినిపించిందని పలువురు చెప్పుకొస్తున్నారు. రజనీకాంత్ క్రేజ్ అంతటా ఉంటుందని తెలియజేస్తూ ఒలంపిక్స్ , అన్నాత్తె, 46 ఏళ్ల రజనీయిజం, నీరజ్ చోప్రా అనే హ్యాష్టాగ్లతో పలు పోస్ట్లని తెగ వైరల్ చేస్తున్నారు. రజనీ నటించిన అన్నాత్తె చిత్రం దీపావళి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే.