వైవాహిక జీవితంలో అడుగుపెట్టాక తమ జీవితంలో ఏ మార్పు లేదని అంటున్నాడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. పెళ్లయిన మరుసటి రోజే ఎవరి షూటింగ్లకు వాళ్లు వెళ్లిపోయాం అని చెబుతున్నాడు. నాయిక ఆలియా భట్తో ఐదేళ్లుగా సహ జీవనం చేసిన ఈ యువహీరో ఇటీవలే మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. పెళ్లయ్యాక జీవితం ఎలా ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగితే..ఏ మార్పు లేదని చెప్పారు. రణబీర్ కపూర్ మాట్లాడుతూ…‘వివాహం వల్ల మా జీవితాల్లో కొత్తగా వచ్చిందేమీ లేదు. ఆలియా, నేనూ గత ఐదేళ్లుగా కలిసి ఉంటున్నాం. జీవితం పట్ల మా ధృక్పథాలు, ఆలోచనలు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి.
పెళ్లయిన మరుసటి రోజే నేను, ఆలియా ఎవరి షూటింగ్లకు వాళ్లం వెళ్లిపోయాం. వీలు దొరికితే కాస్త విరామం తీసుకోవాలని భావిస్తున్నాం. ఆలియా ప్రస్తుతం హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నది. నేనలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పుడు మరో భాషలో సినిమా కోసం వెళ్లి ఆడిషన్స్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు’ అని అన్నాడు. సందడి, హడావుడి మధ్య ఒక్కటైన ఈ స్టార్ కపుల్…తర్వాతి రోజే షూటింగ్లకు వెళ్లడం ఆశ్చర్యపరిచింది. ఆలియా తన హాలీవుడ్ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో నటిస్తుండగా..రణబీర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.