బాలీవుడ్లో మరో రామాయణం రాబోతున్న విషయం తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో అల్లు అరవింద్, మధు మంతెన కలిసి నిర్మిస్తున్న ఈ రామాయణంలో రాముడిగా రణబీర్కపూర్ నటిస్తున్నారు. ఇటీవలే సీతగా సాయిపల్లవి ఖరారైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది.
ఇదిలావుంటే.. శ్రీరామచంద్రమూర్తిగా నటిస్తున్న కారణంచేత, పాత్ర పవిత్రత దృష్ట్యా సినిమా పూర్తయ్యేంతవరకూ మద్యపానానికి, మాంసాహారానికి దూరంగా ఉండాలని హీరో రణబీర్కపూర్ నిర్ణయించుకున్నారట. ఆయన దారిలోనే టీమ్ అంతా కూడా అదే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పవిత్రంగా , భక్తితో, ప్రేమతో రామకథను తెరకెక్కించాలని దర్శకుడు నితేశ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ రామాయణంలో మిగిలిన పాత్రలు ఎవరు పోషించనున్నారో తదితర వివరాలు తెలియాల్సివుంది.