ఏదైనా కొత్తగా చేస్తేనే నలుగురి మెప్పు పొందుతున్న విజయ సూత్రాన్ని నమ్మిన జైరాజ్ మెగాహీరోలకు వీరాభిమాని. చిన్నతనం నుంచి ఆర్ట్ పట్ల అభిరుచిని పెంచుకున్న జైరాజ్.. రామ్చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా గొర్లఖాన్ దొడ్డి పొలాల్లో చరణ్ చిత్రాన్ని పండించి ఆకాశమంత అభిమానాన్ని చాటుకున్నాడు. గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి ప్రాంతంలో జైరాజ్ పొలాల్ని కౌలుకు తీసుకుని రాంచరణ్ వరిచిత్రాన్ని వేయడం ప్రారంభించాడు. రామ్చరణ్ బొమ్మను చిత్రీకరించాడానికి జైరాజ్ మూడు నెలలు కష్టపడ్డాడు. ప్రతి పుట్టినరోజు నాడు కొత్తగా ఏదో చేసి అభిమాన హీరోకి అంకితం చేయాలన్న తపనతో ఉన్న జైరాజ్.. అభిమాని అంటే ఇలా ఉండాలనే విధంగా తనని తాను తీర్చి దిద్దుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రామ్చరణ్, జైరాజ్ను తన ఇంటికి పిలిపించుకుని సుమారు 45 నిముషాలు మాట్లాడాడు. అంతేకాకుండా జైరాజ్కు తగిన ఆర్థిక సహాయం చేసి.. సినీపరిశ్రమలో తగిన స్థానం కల్పిస్తానని మాట ఇచ్చాడు.
ఈ సందర్భంగా జైరాజ్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్న శ్రీ రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని తెలిపాడు. జైరాజ్ తన ఊరు నుంచి రామ్చరణ్ ఇంటివరకు 264 కిలోమీటర్లు కాలినడకన వచ్చి చరణ్ను కలుసుకున్నానని, ఆయన్ని కలుసుకున్న క్షణాలు గుండెల్లో పెట్టుకుని దాచుకుంటానని చెప్పాడు. ఇక జై రాజ్ తన ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్తూ.. రామ్చరణ్ వరి చిత్రాన్ని పొలాల్లో పండించేందుకు వేల రూపాయల దాక ఖర్చయిందని.. దీనికి యూ.ఎస్లో ఉన్న విజయ్ రేపల్లే గారు ఖర్చును భరించారని తెలిపాడు. రామ్చరణ్ వరిచిత్రాన్ని ప్రారంభించేప్పుడు అప్పు చేసి ఖర్చును చేయొద్దంటూ స్వామినాయడు చెప్పాడని అన్నాడు. ఇక స్వామినాయుడు గారు అందిస్తున్న ప్రొత్సాహం మరిచిపోలేనిదని చెప్పుకొచ్చాడు.
One of fan
@AlwaysRamCharan’s named Jairaj creates an artistic portrait of #RamCharan with paddy crops in his paddy field in Gorlakhan Doddi, Gadwal.He walked 264 KMs to meet @AlwaysRamCharan and explain about his artefact. pic.twitter.com/UTnpoRbRGl
— Maduri Mattaiah (@madurimadhu1) May 28, 2022