actress Rambha | ప్రముఖ నటి రంభ అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. రంభ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పాఠశాల నుంచి పిల్లల్ని తీసుకొస్తున్న సమయంలో ఆమె కారును వెనుకనుంచి వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రంభ స్వల్పగాయాలతో బయటపడగా.. కుమార్తె షాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు తాము త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులను కోరింది.
తాజాగా వారు కోలుకొని ఇంటికి చేరుకున్నట్లు రంభ తెలిపింది. తమ ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్టు చేసింది. ‘అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు, మా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నేను, పిల్లలు కోలుకున్నాము. షాషా కూడా కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చింది. మీరు మా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి రుణపడి ఉంటా. థ్యాంక్యూ ఆల్. లవ్ యూ ఆల్’ అని తెలిపారు.
రంభ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జేడీ చక్రవర్తి తదితర స్టార్స్తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రంభ సినిమాలకు దూరంగా ఉంటూ.. భర్తతో కలిసి కెనడాలో సెటిలయ్యారు. రంభకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.