Rama Ayodhya | శ్రీరామ నవమి (Ram Navami) వేడుకలకు రామజన్మభూమి అయోధ్య (Ayodhya Ram Mandir) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు జరుగుతుండడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి సుమారు 40 లక్షల మంది భక్తుల వరకు రానున్నారు. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ప్రముఖు తెలుగు ఓటీటీ వేదిక ఆహా సరికొత్త వెబ్ సిరీస్ను తీసుకురాబోతుంది.
బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్య (Rama Ayodhya)లో తీసిన రామఅయోధ్య అనే డాక్యుమెంటరీ సిరీస్ను శ్రీరామ నవమి కానుకగా ఆహా స్ట్రీమింగ్ చేయనుంది. ఈ డాక్యుమెంటరీకి నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత సత్యకాశీ భార్గవ స్టోరీ అందించగా.. కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అయోధ్యలోని రామమందిరంతో పాటు నంది గ్రామం, మహారాజ ప్యాలెస్, భరతుడి తపోవనం, కనక భవన్, దశరథ్ మహల్, దశరథ్ సమాది, మణిపర్వత్, భరతకూపం తదితర అయోధ్యలోని అనేక ముఖ్య ప్రదేశాలను చూపిస్తూ వాటి విశేషాలను చెబుతూ డాక్యుమెంటరీ సాగింది.
Discover the captivating journey of Rama Ayodhya 🙌, a remarkable series unveiling the unparalleled qualities of Rama! 🌟
#RamaAyodhya Premiering exclusively on aha this April 17th! pic.twitter.com/6cpSwox4KX
— ahavideoin (@ahavideoIN) April 15, 2024
ఇక ఈ చిత్రంపై దర్శకుడు మాట్లాడుతూ అయోధ్య అంటే రామమందిరం మాత్రమే కాదు, అనేక పవిత్ర ప్రదేశాలు, మందిరాలు ఉన్నాయి. అవన్నీ మా ఫిల్మ్ లో చాలా బాగా చూపించాము. అంతేకాకుండా శ్రీరాముడి యొక్క గుణములను మనము ప్రస్తుతకాలంలో ఆచరించడం ఎలాగో మేము సింపుల్ గా అందరికీ అర్థం అయ్యేలా తెరకెక్కించాము అని వెల్లడించారు.