ఆర్ఆర్ఆర్ విజయంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఆర్సీ15 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా అనంతరం ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనతో రాంచరణ్ సినిమా చేయనున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలుబడగా.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
నేడు బుచ్చిబాబు సన పూట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ”నా అభిమాన దర్శకుల్లో ఒకరైన బుచ్చిబాబుకి జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఈ సంవత్సరం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా, త్వరలో మనం సెట్స్లో కలుద్దాం అని” చరణ్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్టు వైరల్గా మారింది.
రాంచరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా తను తెలుగులో సినిమాలు చేయాలనుకుంటోంది. అయితే, కొన్ని అవకాశాలు వచ్చినా పలు కారణాలతో వాటిని చేయలేదు. దీంతో ఈ మూవీతో అయిన తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని జాన్వీ ఎదురుచూస్తుంది.
Happiest birthday to one of my fondest directors @BuchiBabuSana !!
Wishing an incredibly happy and healthy year ahead.See you on sets soon!❤️ pic.twitter.com/ZuWTLa3fRZ
— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2023