గత ఏడాది నుండి ప్రతి ఒక్కరం కరోనాకి భయపడుతూనే బ్రతుకుతున్నాం. ప్రభుత్వాలు, పెద్దలు చెప్పిన సూచలను పాటిస్తూ బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నాం. అయితే కరోనా వలన కొందరికి నిద్ర కూడా కరువైందట. దీని నుండి బయట పడాలంటే యోగా నిద్రను ఆశ్రయించాలని రకుల్ అంటుంది. తాను నిదురలేమిని ఎదుర్కొన్నానని దానినుంచి బయటపడేందుకు తన యోగా శిక్షకుడి సలహాలు తీసుకున్నానని తెలిపింది.
రకుల్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒత్తిడి, ఆందోళన చెందినట్టు పేర్కొంది. నేను నిద్రపోలేని ఒత్తిడిలో ఉన్నప్పుడు యోగా నిద్ర సెషన్తో వ్యాయామం అనంతరం ఈ విధంగా విశ్రాంతి తీసుకుంటాను అని యోగా నిద్ర పోతున్న ఫొటోని షేర్ చేసింది. నా శిక్షకుడు చెప్పినట్టు చేశాను. యోగా నిద్ర మీరు చేసి ఒత్తిడిని తరిమి కొట్టండి అంటుంది రకుల్ . ఈ అమ్మడు ప్రస్తుతం అజయ్ దేవ్ గన్ దర్శకత్వం వహిస్తున్న మేడే
లో కథానాయికగా నటిస్తోంది. క్రిష్ తెరకెక్కించిన కొండపొలం రిలీజ్ కావాల్సి ఉంది. అనుభూతి కశ్యప్ క్యాంపస్ కామెడీ-డ్రామా డాక్టర్ జి
లోనూ రకుల్ నటిస్తోంది. ఆయుష్మాన్ ఖుర్రానా ఇందులో హీరో. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఛత్రివాలి
లో.. ఇంద్ర కుమార్ స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ
లో కూడా ఆమె నటించనుంది.