టాలీవుడ్ డ్రగ్స్ కేసు ( Tollywood Drugs Case ) లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED ) అధికారులు.. నటి రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ) పై ప్రశ్నల వర్షం కురిపించారు. మనీలాండరింగ్ కేసులో నోటీసులిచ్చిన ఈడీ అధికారులు హైదరాబాద్లోని కార్యాలయంలో రకుల్ను పలు అంశాలపై దాదాపు ఆరు గంటల పాటు విచారించారు. రకుల్ బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు పరిశీలించారు. అనంతరం బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలపై ప్రశ్నించారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మిని ఈడీ అధికారులు విచారించారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED ) 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం పూరీ జగన్నాథ్ని 10 గంటల పాటు విచారించారు. పలు కోణాలలో పూరీని విచారించినట్టు తెలుస్తుంది. ఇక గురువారం ఛార్మీని ఈడీ విచారించింది. ఆమెను 8 గంటల పాటు ప్రశ్నించగా, అవసరమైతే మరో సారి తాను విచారణకు హాజరు అవుతానని పేర్కొంది.
ఇక ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరైంది. చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదితో కలిసి రకుల్ ఈడీ ఆఫీసుకు చేరుకుంది. ఈ నెల 6వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED ) అధికారుల ముందు రకుల్ హాజరు కావాల్సి ఉంది. అయితే వరుస షూటింగులతో తాను ఫుల్ బిజీగా ఉన్నానని చెప్పిన ఈ స్టార్ హీరోయిన్.. తనకు కొంత గడువు ఇవ్వాలని అడిగిందట. కాని గడువు ఇవ్వమని చెప్పిన ఈడీ ఈ రోజు రకుల్ని పిలిపించినట్టు సమాచారం.