Rakhi Sawant | గత నెలలో కోర్ట్ మ్యారేజ్ చేసుకున్న నటి రాఖీ సావంత్.. భర్త అదిల్ ఖాన్ దురానీపై దొంగతనం కేసు పెట్టింది. తన డబ్బు, ఆభరణాలను దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అదిల్ఖాన్ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆదిల్ ఖాన్ దురానీని ఓషివారా పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు తనను మోసం చేశాడని గత రాత్రి రాఖీ ఆదిల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతడిపై ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రాఖీ ఇంటి నుంచే అదిల్ను అదుపులోకి తీసుకున్నారు. పెండ్లి పేరుతో అదిల్ తన వద్ద ఉన్న నగలు, డబ్బులన్నీ తీసుకున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపింది. అదిల్ తన ఇంటి తాళాలను లాక్కుని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని వాపోయింది. ఓ మహిళతో సంబంధం పెట్టుకుని తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని కూడా రాఖీ ఆరోపించింది. బాలీవుడ్లో పేరు సంపాదించుకోవడానికి తనను ఉపయోగించుకున్నాడని తెలిపింది. రాఖీతో విడిపోయి తన స్నేహితురాలు తనూతో కలిసి ఉంటున్నట్లు అదిల్ తనతో చెప్పాడని రాఖీ పేర్కొన్నది.
రాఖీ సావంత్-అదిల్ ఖాన్ దురానీ గత నెలలో కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి అదిల్ ఖాన్ దురానీ వయస్సు 27 సంవత్సరాలు. వీరు 2022 మే నెల నుంచి డేటింగ్లో ఉన్నారు. రాఖీతో పాటు అదిల్ కూడా ముంబైలో డ్యాన్స్ అకాడమీని ప్రారంభించాడు. అదిల్ ఖాన్ ఒక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఐదు రోజుల క్రితం రాఖీ సావంత్ ముంబై మీడియా ఎదుట వాపోయింది. అక్కడే వారిద్దరికీ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంతలో మనసు మార్చుకుని కేసు పెట్టడంతో వీరి పెండ్లి పెటాకులయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు వారాల క్రితమే రాఖీ తల్లి మరణించింది.