డెహ్రాడూన్: జైలర్ సినిమా విడుదలకు ఒకరోజు ముందు హిమాలయాల యాత్రకు బయలుదేరిన స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth).. శనివారం బద్రీనాథుని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. చార్ధామ్లో ఓ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్లో బద్రీనాథీశ్వరుడి దర్శనం అనంతరం ఆయన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. లైట్ బ్లూ స్వెటర్లో ఆలయానికి వచ్చిన రజినీతో అభిమానులు పోటీపడి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
నెల్సన్ దిలీప్కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన చిత్రం ‘జైలర్’ (Jailer) ఇటీవల విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొడుతోంది. ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్యన్ అనే రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్రలో రజినీ నటించారు. గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.200 కోట్లు వసూళ్లు చేసిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అదేవిధంగా రిషికేష్లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని కూడా శనివారం రజనీ సందర్శించారు. ‘ఎన్నో అంచనాల మధ్య జైలర్ సినిమా విడుదలైంది. కంగారుపడొద్దు. సినిమా తప్పకుండా విజయం అందుకుంటుంది’ అని స్వామీజీ చెప్పారని రజినీకాంత్ తెలిపారు. స్వామీజీయే స్వయంగా ఆ మాట చెప్పారంటే తప్పకుండా జైలర్ సినిమా హిట్ అయినట్టేనని అన్నారు.