Neeraj Chopra | టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్లో ఒకరు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran). యాక్టర్గానే కాకుండా దర్శకుడిగా కూడా అందరికీ పెద్దగా పరిచయం అక్కర్లేని సెలబ్రిటీ. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్తో అందరినీ పలుకరిస్తుంటాడు రాహుల్ రవీంద్రన్. ఇదిలా ఉంటే.. రాహుల్ తాజాగా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు.
భారత జావెలిన్ త్రోయర్, ఒలింపియన్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)తో కలిసి రాహుల్ రవీంద్రన్ బ్రేక్ఫాస్ట్ చేశాడు. ఈ విషయాన్ని రాహుల్ సోషల్ మీడియాలో తెలుపుతూ.. ”నాకు తెలిసిన వారెవరైనా లేదా ట్విట్టర్లో నన్ను అనుసరించే ఎవరికైనా దీని అర్థం తెలుస్తుంది. ఛాంపియన్తో ఈ అల్పాహారం ఎప్పటికీ మరచిపోలేను అంటూ ట్విట్టర్లో రాసుకోచ్చాడు. ఇక ఈ ఫొటోలో రాహుల్ రవీంద్రన్, నీరజ్ చోప్రాతో పాటు టాలీవుడ్ నటుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) కూడా ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
Anyone who knows me or even just follows me on Twitter will know what this means to me. ♥️ This breakfast with the champion will never ever be forgotten ♥️ pic.twitter.com/TaXLXnD2tD
— Rahul Ravindran (@23_rahulr) October 9, 2023
ఇదిలా ఉండగా.. ఇటీవలే చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత జావెలిన్ త్రోయర్, ఒలింపియన్ నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించాడు. నీరజ్ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టాడు. ఇదే ఈవెంట్లో భారత్కు చెందిన మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా రజత పతకం నెగ్గాడు. తన నాలుగో ప్రయత్నంలో ఈటెను 87.54 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలువడం ద్వారా రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.