ప్రభాస్, పూజాహెగ్డే (Prabhas-Pooja Hegde) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్ రాధేశ్యామ్ (Radhe Shyam). యూనివర్సల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 11న శుక్రవారం వరల్డ్ వైడ్గా గ్రాండ్గా విడుదల కాబోతుంది. ప్రభాస్ ఆఫ్లైన్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంటే..డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ (Radha Krishna Kumar)ఆన్లైన్ ద్వారా హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఆదివారం ఫ్యాన్స తో చిట్ చాట్ సెషన్ లో పాల్గొన్నాడు రాధాకృష్ణకుమార్.
ఓ అభిమాని బుక్ మై షో టికెటింగ్ పోర్టల్ (Book My Show ticketing portal) లో ఉన్న ఫొటోను మార్చారని టీంను కోరాడు. దీనికి డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ స్పందించాడు. ఈ విషయాన్ని బుక్ మై షో టీంకు తెలియజేస్తామని చెప్తూనే..మరోవైపు బుక్ మై షో టీం (Book My Show) కు ఓ ట్వీట్ పెట్టాడు. ప్రియమైన బుక్ మై షో బృందం..ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్లో రాధేశ్యామ్ పోస్టర్ను మార్చేందుకు ప్రయత్నించడంపై దృష్టిపెట్టాలని ట్వీట్ చేశాడు.
Dear @bookmyshow team can u pls look into our request of changing the poster for #RadheShyam movie!! @RadheShyamFilm
— Radha Krishna Kumar (@director_radhaa) March 7, 2022
అయితే ఆన్లైన్ పోర్టల్ డైరెక్టర్ రిక్వెస్ట్కు స్పందించకపోవడంతో..అభిమానులే పాత పోస్టర్ల స్థానంలో డిఫరెంట్ పోస్టర్లను మారుస్తున్నారు. రాధేశ్యామ్ డైరెక్టర్ అండ్ అభిమానుల విజ్ఞప్తికి బుక్ మై షో టీం ఇప్పటికీ స్పందిచకపోవడం గమనార్హం. ప్రభాస్ అండ్ పూజాహెగ్డే టీం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.