ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది పంజాబీ సోయగం రాశీఖన్నా. ‘థాంక్యూ’ సినిమా తర్వాత తెలుగులో ఏ చిత్రానికి అంగీకరించలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో పూర్వ వైభవాన్ని సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉందీ భామ. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు తెలుగులో నితిన్తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్హుడ్’ పేరుతో సినిమా తెరకెక్కుతున్నది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలో రాశీఖన్నాను నాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. గతంలో ఈ జంట ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలో నటించారు. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నది. రాశీఖన్నా నటించిన తమిళ చిత్రం ‘అరణ్మనై-4’…‘బాక్’ పేరుతో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.